భారతదేశం, జూన్ 6 -- జూన్ 20 నుంచి ఇండియా, ఇంగ్లాండ్ మధ్య టెస్టు సిరీస్ స్టార్ట్ కాబోతోంది. అయిదు మ్యాచ్ ల సిరీస్ లో ఈ రెండు జట్లు తలపడబోతున్నాయి. అయితే ఈ సిరీస్ కు పేరు మార్పు చేయాలనే ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) నిర్ణయం తీసుకుంది. దీనిపై ఓ వైపు విమర్శలు వస్తున్నాయి. పటౌడీ ట్రోఫీ బదులు అండర్సన్-సచిన్ ట్రోఫీ అని పేరు మార్చబోతున్నారని ఈఎస్పీఎన్ క్రిక్ఇన్ఫో రిపోర్ట్ పేర్కొంది.

ఈఎస్పీఎన్ క్రిక్ఇన్ఫో ప్రకారం పటౌడీ ట్రోఫీకి అండర్సన్-సచిన్ పేరు పెట్టబోతున్నారని తెలిసింది. జూన్ 11 న లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్లో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా మధ్య జరిగే ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్లో ఈ ఇద్దరు దిగ్గజాలు కొత్త జెర్సీని ఆవిష్కరించనున్నారు. ఈ నెల 20 నుంచి హెడింగ్లీలోని లీడ్స్ వేదికగా భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య తొలి టెస్ట...