భారతదేశం, జూన్ 5 -- టీమిండియాతో సొంతగడ్డపై సిరీస్ కోసం ఇంగ్లాండ్ సన్నాహకాలు మొదలెట్టింది. దాని హోం గ్రౌండ్ లో ఇండియాను ఓడించడమే లక్ష్యంగా ఇంగ్లాండ్ సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో జూన్ 20న హెడింగ్లీలో ప్రారంభమయ్యే తొలి టెస్టు కోసం ఇంగ్లాండ్ 14 మంది ఆటగాళ్ల జట్టును ప్రకటించింది. బెన్ స్టోక్స్ జట్టుకు నాయకత్వం వహిస్తారు.

టీమిండియాను కట్టడి చేసేందుకు పేసర్ జేమీ ఓవర్టన్ ను ఇంగ్లాండ్ టీమ్ టెస్టులకు ఎంపిక చేసింది. మూడు సంవత్సరాల తర్వాత ఓవర్టన్ తిరిగి టెస్టు టీమ్ కు ఎంపికవడం గమనార్హం. ఓవర్టన్ ఇప్పటివరకు ఒకే ఒక్క టెస్ట్ మాత్రమే ఆడాడు. అది 2022లో న్యూజిలాండ్‌తో. తాజాగా జింబాబ్వేతో జరిగిన టెస్ట్‌లో గాయపడిన అట్కిన్సన్ ఇండియాతో తొలి టెస్టుకు ఇంగ్లాండ్ టీమ్ లో చోటు దక్కించుకోలేకపోయాడు.

సీమ్, స్వింగ్ కు అనుకూలించే సొంత గడ్డపై ఇండియాను పేస్ తో దెబ్బకొట్టేం...