Hyderabad, మే 15 -- జ్వరంగా అనిపించినా, శరీరంలో ఏదైనా భాగంలో నొప్పిగా అనిపించినా ఇండియన్లు సాధారణంగా వాడే మెడిసిన్ డోలో 650. ఇది ఎంతలా అలవాటైందంటే, డాక్టర్‌ను కలవకుండా కూడా పారాసిటమాల్ తీసుకుంటే సరిపోతుందని ఫిక్సయిపోతున్నారు. కొవిడ్-19 తర్వాత దీని వాడకం మరింత పెరిగిపోయింది. ఇప్పుడు అమెరికన్ డాక్టర్ పాయింట్ చేసి మరీ, ఇండియన్లు పారాసిటమాల్ పై ఎంతగా ఆధారపడుతున్నారో చెప్పిన తర్వాత ఈ టాపిక్ మరోసారి వైరల్ అయింది.

అమెరికాకు చెందిన భారత సంతతి వైద్యుడు డా. పలానియప్పన్ మాణిక్కం గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్, హెల్త్ ఎడ్యుకేటర్‌గా పనిచేస్తున్నారు. రీసెంట్‌గా సోషల్ మీడియా ట్విట్టర్లో ఇండియాలో Dolo-650 వాడకంపై ఇలా రాసుకొచ్చారు. "ఇండియన్లు Dolo-650ని క్యాడ్బరీ జెమ్స్ లా భావిస్తున్నారంటూ పోస్టు పెట్టారు. దీనికి 25వేల మంది నుంచి లైక్ రెస్పాన్స్ వచ్చింది. అందులో...