భారతదేశం, ఏప్రిల్ 29 -- రాష్ట్రంలో ఇటీవల విడుదలైన ఇంటర్ ఫలితాల్లో.. ప్రభుత్వ కాలేజీల్లో చదివే విద్యార్థులు ఎక్కువ మంది ఫెయిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అయ్యారు. జనరల్ కేటగిరీలో ఫస్టియర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 68,100 మంది పరీక్షలు రాయగా కేవలం 28 వేల 937 మంది అంటే 42.49 శాతం మాత్రమే ఉత్తీర్ణత సాధించారు. ఇక ద్వితీయ సంవత్సరంలో 74 వేల 161 మంది ఎగ్జామ్స్ రాస్తే.. 39 వేల 630 మంది అంటే.. 53.44 శాతం పాసయ్యారు. ఫస్టియర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 57, సెకండియర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 42 శాతం మంది ఫెయిల్ అయ్యారని లెక్కలు చెబుతున్నాయి.

ఉత్తీర్ణత శాతం ఇంత దారుణంగా ఉండటంపై ప్రభుత్వం సీరియస్ అయినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలోనే ఫెయిలైన విద్యార్థులతో పాటు ఇంప్రూవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ రాయాలనుకునే వారికి ప్రత్యేకంగా తరగతులు నిర్వహించాలని ప...