Andhrapradesh, సెప్టెంబర్ 10 -- ఏపీ అటవీశాఖలో తానేదార్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఈ మేరకు రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటన విడుదల చేసింది. మొత్తం 10 ఖాళీలు ఉండగా. అర్హులైన అభ్యర్థులు ఆన్ లైన్ లో అప్లయ్ చేసుకోవాల్సి ఉంటుంది.

ఆన్ లైన్ దరఖాస్తుల ప్రక్రియ సెప్టెంబర్ 11 నుంచి ప్రారంభమవుతుంది. అక్టోబర్‌ 1వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు. ఇంటర్మీడియట్ అర్హతతో ఈ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. రాత పరీక్ష ఆధారంగా నియామక ప్రక్రియను పూర్తి చేస్తారు. ఏపీపీఎస్సీ వెబ్ సైట్ లోకి వెళ్లి ఫీజు చెల్లింపు, అప్లికేషన్ ప్రాసెస్ పూర్తి చేసుకోవాలి. పరీక్ష తేదీలు, హాల్ టికెట్ డౌన్లోడ్ వివరాలను త్వరలోనే ప్రకటించనున్నారు.

Published by HT Digital Content Services with permission from HT Telugu....