భారతదేశం, మే 15 -- ఓ వైపు ఐపీఎల్ 2025 పున:ప్రారంభం సందడి కొనసాగుతుండగా.. మరోవైపు ఇంగ్లాండ్ టూర్ కోసం టీమిండియా సెలక్షన్ పై ఇంట్రెస్ట్ నెలకొంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి రిటైర్మెంట్ తో భారత టెస్టు టీమ్ ఎలా ఉండబోతుందనే ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో గురువారం (మే 15)న ముంబయిలో సెలక్షన్ కమిటీతో హెడ్ కోచ్ గంభీర్ సమావేశమవుతున్నాడు. అంతకంటే ముందు సిద్ధి వినాయక టెంపులలో గంభీర్ పూజలు చేశాడు.

టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ గురువారం ముంబయిలోని ప్రఖ్యాత సిద్ధి వినాయక టెంపుల్ లో భార్యతో కలిసి ప్రత్యేక పూజలు చేశాడు. ఇంగ్లాండ్ టూర్ కోసం టీమిండియా టెస్టు టీమ్ సెలక్షన్ నేపథ్యంలో సెలక్టర్లతో గంభీర్ సమావేశం కానున్నాడు. దీని కంటే ముందు అతను గుడికి వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. ఆలయంలో భార్యతో కలిసి అతను దైవ దర్శనం చేసుకున్నాడు.

కోచ్ గంభీర్ నేతృత్వంలో టెస...