భారతదేశం, ఫిబ్రవరి 21 -- బాలీవుడ్‌లో అవుట్‌సైడర్స్‌గా అడుగుపెట్టి తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్స్ కంగనా రనౌత్, తాప్సీ పన్ను. అయితే, వీరిద్దరి మధ్య గత కొన్నేళ్లుగా తీవ్రమైన విభేదాలు నడుస్తున్నాయని సోషల్ మీడియాలో, మీడియా వర్గాల్లో పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది.

తాజాగా తన కొత్త సినిమా 'అస్సి' (Assi) ప్రమోషన్లలో భాగంగా ఒక పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న తాప్సీ కాంట్రవర్సీ క్వీన్ కంగనా రనౌత్‌తో గొడవపై మొదటిసారి పూర్తి క్లారిటీ ఇచ్చారు. దీంతో తాప్సీ పన్ను కామెంట్స్ నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి.

శుభంకర్ మిశ్రా పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న తాప్సీ మాట్లాడుతూ.. "మా మధ్య గొడవ ఎప్పుడు జరిగిందో నాకైతే తెలియదు. సాధారణంగా ఇద్దరు వ్యక్తులు పరస్పరం గొడవ పడితేనే దాన్ని ఫైట్ అంటారు. కానీ, నేను ఎప్పుడూ తనతో తలపడలేదు. నా స్టేట్‌మెంట్స్ అన్నీ తీస...