Hyderabad, మే 26 -- టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటించిన లేటెస్ట్ సినిమా భైరవం. మంచు మనోజ్, నారా రోహిత్ మరో ఇద్దరు హీరోలుగా చేస్తున్నారు. డైరెక్టర్ విజయ్ కనకమేడల దర్శకత్వం వహించిన ఈ సినిమాను శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కెకె రాధామోహన్ నిర్మించారు. పెన్ స్టూడియోస్ డాక్టర్ జయంతీలాల్ గాడా సమర్పించారు.

భైరవం సినిమా మే 30న ఈ సీజన్‌లో బిగ్గెస్ట్ రిలీజ్‌కి సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు. అలాగే, పూరీ జగన్నాథ్‌తో మూవీపై బెల్లంకొండ సాయి శ్రీనివాస్ క్లారిటీ ఇచ్చాడు.

-హైందవ స్క్రిప్ట్ ఓకే చేసి దాదాపు మూడేళ్లు అవుతుంది. అది నాకు చాలా పాషనేట్ ప్రాజెక్టు. హైందవ, టైసన్ నాయుడు తర్వాత ఇంకేది చేయకూడదు అనుకున్నాను. ఈ ప్రాసెస్‌లో ఉన్నప్పుడు అనుకోకుండా భైరవం, కి...