Hyderabad, మే 19 -- టాలీవుడ్ హీరోలు బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ కలిసి నటించిన మల్టీ స్టారర్ సినిమా భైరవం. మోస్ట్ అవైటెడ్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాకు విజయ్ కనకమేడల దర్శకత్వం వహించారు. మే 30న గ్రాండ్ రిలీజ్ కానున్న భైరవం ట్రైలర్‌ను తాజాగా మే 18న రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన భైరవం ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మాట్లాడుతూ.. "అందరికి నమస్కారం. అందరూ భైరవం ట్రైలర్ ఎంజాయ్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. ట్రైలర్‌లానే సినిమా కూడా చాలా అద్భుతంగా ఉండబోతుంది. అందరూ సినిమాని సపోర్ట్ చేసి ఘన విజయాన్ని అందించాలని కోరుకుంటున్నాను" అని అన్నాడు.

"చాలా ప్రేమించి ఇష్టపడి, కష్టపడి మంచి ఎక్స్‌పీరియన్స్ ఇవ్వాలని చేశాం. మే 30న ...