భారతదేశం, మే 27 -- తెలుగుదేశం పార్టీ మహానాడు అతిథ్య మెనూ.. కార్యకర్తలకు ఆహ్వానం పలుకుతోంది. రాష్ట్ర నలుమూలల నుంచి పార్టీ కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు వస్తున్న నేపథ్యంలో.. వారికి ఆంధ్రా, రాయలసీమ, తెలంగాణకు చెందిన ప్రత్యేక వంటకాలను రుచి చూపించనున్నారు. చాలాకాలం తర్వాత మహానాడులో మాంసాహారం కూడా వడ్డిస్తున్నారు.

మహానాడులో మొదటి రెండు రోజులు 2 లక్షల మందికిపైగా ఉదయం అల్పాహారం, మధ్యాహ్న భోజనం, సాయంత్రం స్నాక్స్‌ అందించేందుకు వీలుగా ఏర్పాట్లు చేశారు. గురువారం బహిరంగ సభకు భారీగా కార్యకర్తలు తరలి వస్తారని అంచనా వేస్తున్నారు. మహానాడు ప్రాంగణంలో రెండు లక్షల మందికి ఆహారం అందిస్తూనే.. వెలుపల నలుదిక్కులా ఫుడ్‌ కోర్టులు ఏర్పాటు చేశారు. అక్కడ సుమారు 3 లక్షల మందికి భోజనాలు అందజేసేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు.

మహానాడు సందర్భంగా ప్రతిరోజూ భోజనాల్లో 20 రకా...