Hyderabad, మే 17 -- సేతుబంధాసనంలో యోగాలో ముఖ్యమైన భంగిమ. ఇది శారీరక, మానసిక ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటుంది. ముఖ్యంగా ఊపిరితిత్తుల వ్యాధులతో బాధపడే వారికి శరీరంలో ఆక్సిజన్ ప్రసరణను పెంచాలనుకునే వారికి సేతుబంధాసనం ఎంతో ముఖ్యమైనది. ఆస్తమా వంటి సమస్యలతో బాధపడేవారు ప్రతిరోజు సేతుబంధాసనం వేయడం వల్ల ఎన్నో ప్రయోజనాలను పొందుతారు.

ఆస్తమా అనేది ఒక శ్వాసకోశ వ్యాధి. ఇది చిన్నగా కనిపిస్తున్నా పెట్టే ఇబ్బంది మాత్రం ఎక్కువే. ఏమాత్రం గాలి కాలుష్యం ఉన్నా చిన్న చిన్న దుమ్ము ధూళి శ్వాసకోశ వ్యవస్థలో చేరినా విపరీతమైన దగ్గు, ఆయాసంతో ఇబ్బంది పడిపోతారు. కాబట్టి ఆస్తమాను కేవలం మందులతోనే కాకుండా యోగాతో కూడా తగ్గించుకోవాలి.

ఆస్తమా రోగులు శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడడంతో పాటు పిల్లికూతలు, విపరీతమైన దగ్గుతో బాధపడుతూ ఉంటారు. సాధారణ జీవితం కష్టంగా ఉంటుంది. కాబట్టి...