భారతదేశం, జూలై 4 -- హైదరాబాద్: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అధినేత కె. చంద్రశేఖర్ రావు (కేసీఆర్) అస్వస్థతతో గురువారం హైదరాబాద్‌లోని యశోద సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో చేరారు. తీవ్ర నీరసంతో బాధపడుతున్నట్లు ఆయన చెప్పడంతో ఆసుపత్రిలో చేర్చారు.

ఆసుపత్రి వర్గాలు విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం, ప్రాథమిక పరీక్షల్లో కేసీఆర్‌కు అధిక రక్త చక్కెర స్థాయిలు (High Blood Sugars), తక్కువ సోడియం స్థాయిలు (Low Sodium Levels) ఉన్నట్లు గుర్తించారు. ఈ కారణంగానే ఆయనకు అసౌకర్యం కలిగిందని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం కేసీఆర్‌ను వైద్యుల పర్యవేక్షణలో ఉంచి, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి, సోడియం స్థాయిలను పెంచడానికి మందులు అందిస్తున్నారు.

తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. కేసీఆర్‌క...