భారతదేశం, మే 19 -- ళ్లీ కరోనా కేసులు క్రమక్రమంగా పెరుగుతున్నాయి. గత కొన్ని వారాల్లో సింగపూర్, హాంకాంగ్, థాయ్‌లాండ్‌లో కోవిడ్ -19 కేసులు పెరిగాయి. మరోవైపు భారతదేశంలోనూ మెుత్తం కేసులు 257గా నమోదు అయ్యాయి. మే 12 నుంచి వారం రోజుల వ్యవధిలో 164 కొత్త కేసులు వచ్చాయి. కేరళ, మహారాష్ట్ర, తమిళనాడులో ఎక్కువగా కేసులు వెలుగుచూశాయి. నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్, ఎమర్జెన్సీ మెడికల్ రిలీఫ్ (ఇఎంఆర్) విభాగం, విపత్తు నిర్వహణ సెల్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ఐసిఎంఆర్), కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రుల నిపుణులు అప్రమత్తమవుతున్నారు.

అయితే దేశంలో కోవిడ్ పరిస్థితి అదుపులోనే ఉందని అధికారులు చెబుతున్నారు. 'అందుబాటులో ఉన్న ప్రాథమిక సమాచారం ప్రకారం, కేసులు చాలావరకు తేలికపాటివి, మరణాలతో సంబంధం కలిగి ఉండవు.' అని అధికారులు చెబుతున్నారు. భారత్‌లో పరిస్థితి అదుప...