భారతదేశం, జూన్ 5 -- బెంగళూరులో ఆర్సీబీ విజయోత్సవం చిన్నబోయింది. ఎంతో ఆనందంగా మెుదలైన ర్యాలీ.. విషాదంగా ముగిసింది. ఆర్సీబీ విజయోత్సవ వేడుకల సందర్భంగా బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వెలుపల బుధవారం జరిగిన తొక్కిసలాటలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. 30 మందికి పైగా గాయపడ్డారు. ఈ సంఘటనతో ఈవెంట్ సన్నద్ధత, రద్దీ నియంత్రణపై తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తింది. ఈ విషాదానికి దారితీసిన కొన్ని కీలక అంశాలు ఇలా ఉన్నాయి.

స్టేడియం సమీపంలో మోహరించిన చాలా మంది పోలీసు సిబ్బందికి ఆ రోజు పూర్తి అజెండా గురించి తెలియదు. ఎందుకంటే అంతకుముందే బెంగళూరులో విజయోత్సవర్యాలీని భద్రతా ఇవ్వలేమని పోలీసులు చెప్పారు. కానీ ప్రభుత్వంలోని పెద్దలు రావడంతో పరిస్థితి మారిపోయింది. విధానసౌధలో అధికారిక సన్మాన కార్యక్రమం జరుగుతుండగా, క్షేత్రస్థాయిలో కమ్యూనికేషన్ తెగిపోయిందని డెక్కన్ హెరా...