భారతదేశం, జూన్ 4 -- బెంగళూరులో ఆర్సీబీ ఐపీఎల్ విజయోత్సవ వేడుకల్లో అపశ్రుతి చోటు చేసుకుంది. చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. 50 మందికి పైగా గాయపడ్డారు. ఆర్సీబీ ఐపీఎల్ విజయోత్సవ వేడుకల్లో పాల్గొనడానికి పెద్ద ఎత్తున అభిమానులు తరలి రావడంతో చిన్నసామి స్టేడియం వద్ద తొక్కిసలాట జరిగింది. అభిమానులను పోలీసులు నియంత్రించలేకపోయారు.

బెంగళూరులోని చిన్నసామి స్టేడియం వద్ద బుధవారం మధ్యాహ్నం తొక్కిసలాట జరిగి ఆరుగురు ఆర్సీబీ అభిమానులు ప్రాణాలు కోల్పోయారు. 50 మందికి పైగా గాయపడ్డారు. మంగళవారం రాత్రి పంజాబ్ కింగ్స్తో జరిగిన ఐపీఎల్ ఫైనల్ విజయం తర్వాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఆటగాళ్లను చూసేందుకు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్దకు భారీగా అభిమానులు తరలి వచ్చారు. స్టేడియంలో జరిగే ఆర్సీబీ IPL విక్టరీ పరేడ్‌...