భారతదేశం, జూన్ 6 -- కర్ణాటక బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) ఐపీఎల్ విజయోత్సవ ర్యాలీ సందర్భంగా తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ తొక్కిసలాటలో 11 మంది మరణించగా 50 మందికి పైగా గాయపడ్డారు. దీనిని పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. ఆర్సీబీ మార్కెటింగ్ చీఫ్ నిఖిల్ సోసలేతో పాటు ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ డీఎన్ఏ ఎంటర్టైన్మెంట్ నెట్‌వర్క్స్‌కు చెందిన ముగ్గురు ఎగ్జిక్యూటివ్‌లను అరెస్ట్ చేశారు. ఇప్పటికీ ఈ ఘటనకు సంబంధించి నలుగురు అరెస్ట్ అయ్యారు. అరెస్టు సమయంలో నిఖిల్ సోసలే ముంబై వెళ్లేందుకు బెంగళూరు విమానాశ్రయానికి వెళ్లాడు.

ఇప్పటికే బెంగళూరు పోలీస్ కమిషనర్ బి.దయానంద్‌తో పాటు పలువురు సీనియర్ పోలీసు అధికారులను సస్పెండ్ చేస్తూ కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ...