భారతదేశం, జూన్ 6 -- భారతీయ స్టాక్ మార్కెట్ పై ఆర్ బిఐ పాలసీ ప్రకటన సానుకూల ప్రభావం చూపింది. భారతీయ బెంచ్ మార్క్ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీ జూన్ 6 న దాదాపు ఒక శాతం లాభాల్లో ముగిశాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్ బిఐ) తన జూన్ మానిటరీ పాలసీ సమీక్షలో ఊహించిన దానికంటే ఎక్కువ రెపో రేటు తగ్గింపుతో మార్కెట్లను ఆశ్చర్యపరిచింది.

ఆర్బీఐ ఆర్బీఐ రెపో రేటు కట్ ప్రకటన పెట్టుబడిదారుల సెంటిమెంట్ ను పెంచింది. గవర్నర్ సంజయ్ మల్హోత్రా నేతృత్వంలోని ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ (MPC) తన విధాన వైఖరిని 'అకామడేటివ్' నుంచి 'న్యూట్రల్'కు మార్చింది. ఈ నేపథ్యంలో స్టాక్ మార్కెట్ బెంచ్మార్క్ సూచలైన సెన్సెక్స్ 746.95 పాయింట్లు లేదా 0.92 శాతం పెరిగి 82,188.99 వద్ద ముగియగా, నిఫ్టీ 250 పాయింట్లు లేదా 1 శాతం పెరిగి 25,003.05 వద్ద స్థిరపడింది.

నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 1...