భారతదేశం, మార్చి 13 -- ఆర్జీ కర్ రేప్-మర్డర్ కేసు బాధితురాలి తల్లిదండ్రులు దాఖలు చేసిన తాజా పిటిషన్ను సుప్రీంకోర్టు ఈ నెల 17న విచారించనుంది. గత ఆగస్టులో కోల్కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ ట్రైనీ డాక్టర్ (31) హత్యాచారానికి గురైన సంగతి తెలిసిందే.
ఆగస్టు 9న ఆస్పత్రి ఆవరణలో ఆమె మృతదేహం లభ్యమైంది. మహిళపై అత్యాచారం చేసి హత్య చేశారని ఆరోపించారు. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి.
జనవరిలో ఆర్జీ కర్ అత్యాచారం, హత్య కేసులో ఏకైక దోషి, కోల్కతా పోలీసు పౌర వాలంటీర్ సంజయ్ రాయ్కు కోల్కతాలోని సీల్దాలో గల కోర్టు జీవిత ఖైదు విధించింది. 50 వేల జరిమానా కూడా విధించింది. రాయ్ కు మరణశిక్ష విధించాలని కోరుతూ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ), రాష్ట్ర ప్రభుత్వం రెండూ కలకత్తా హైకోర్టులో అప్పీళ్లు దాఖలు చ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.