Hyderabad, మే 27 -- ఆయుర్వేదంలో, ఆహార సమయానికి చాలా ప్రాముఖ్యతనిస్తారు. ఆహారం కేవలం పొట్ట నింపుకోవడానికి మాత్రమే కాదు, శరీరానికి పోషణను అందించడంలో కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. మనం ఏమి తింటాం, ఎలా తింటాం, ఎప్పుడు తింటాం.. ఈ అంశాలన్నీ మన ఆరోగ్యంపై గణనీయమైన ప్రభావం చూపుతాయి. ఆరోగ్యంగా ఉండటానికి రోజుకు ఎన్నిసార్లు భోజనం చేయాలనే ప్రశ్న చాలా మంది మనసుల్లో ఉంటుంది. ఆరోగ్యకరమైన ఆహారం ఎంత ముఖ్యమో, ఆహారం తీసుకునే సమయం కూడా అంతే ముఖ్యం.

కాబట్టి, ఆయుర్వేదం ప్రకారం రోజులో ఏ సమయంలో భోజనం చేయడం మంచిదో, ఆ ఆహారం ఎలా ఉండాలో తెలుసుకుందాం.

ఆయుర్వేదం ప్రకారం, రోజుకు రెండుసార్లు భోజనం చేయడం శరీరానికి చాలా మంచిది. ఆయుర్వేదంలో చెప్పిన దాని ప్రకారం.. "ఒకేసారి భోజనం చేసేవారు యోగులు, రెండుసార్లు భోజనం చేసేవారు భోగీలు , మూడుసార్లు భోజనం చేసేవారు రోగీలు" అని. ద...