భారతదేశం, అక్టోబర్ 12 -- భద్రాద్రి కొత్తగుడెం జిల్లాలోని దమ్మపేట మండలం అప్పారావుపేట ఆయిల్ పామ్ ఫ్యాక్టరీలో పామాయిల్ రైతుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఆయిల్ ఫెడ్ ఛైర్మన్ జంగా రాఘవరెడ్డి, ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, కలెక్టర్ జితేష్ వి.పాటిల్ పాల్గొన్నారు. పామాయిల్ రైతుల అనుభవాలు, ఆయిల్ ఫెడ్ ఉద్యోగుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు మంత్రి తుమ్మల. ఈ సందర్భంగా మాట్లాడారు.

'తెలంగాణ గేమ్ ఛేంజర్‌గా ఆయిల్ పామ్ సాగవుతోంది. మన దేశానికి వంట నూనెలు దిగుమతి చేసుకోకుండా ఆయిల్ పామ్ సాగుతో స్వయం సమృద్ధి సాధించవచ్చు. ప్రతి ఏడాది లక్ష కోట్ల రూపాయల విలువ గల పామాయిల్ దిగుమతి చేసుకుంటున్నాం. పది లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేయడానికి టార్గెట్‌గా పెట్టుకున్నాం.' అని మంత్రి తుమ్మల మాట్లాడారు.

యూరియా కారణంగా క్యాన్సర్ ...