Hyderabad, మే 7 -- పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిని భారతీయులు ఎప్పటికీ మర్చిపోలేరు. కొత్తగా పెళ్లై హనీమూన్ కోసం పహల్గాం వెళ్లిన జంట ఆరు రోజుల్లోనే శాశ్వతంగా విడిపోయింది. నుదుటి సింధూరంతో పహల్గాంలో అడుగుపెట్టిన పెళ్లికూతురు ఇంటికి చేరే సరికి ఆ సింధూరం కరిగిపోయింది.

ఉగ్రవాదులంతా ఆడవారి ఎదురుగానే వారి భర్తలను చంపేశారు. వారి నుదిటి సింధూరాన్ని తుడిచేశారు. అందుకే ఉగ్రవాదులను ఏరివేసే ఈ యుద్ధ చర్యకు ఆపరేషన్ సింధూర్ అనే పేరును పెట్టారు. భారతీయ సంస్కృతిలో సింధూరానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది.

వైవాహిక జీవితంలో సింధూరమే ముఖ్య చిహ్నం. అలాంటి సింధూరాన్ని చెరిపేసిన వ్యక్తులకు ఎలాంటి విలువ ఉండదు. తమ దేశ మహిళల నుదుటిన సింధూరాన్ని చెరిపేసిన ఉగ్రవాదులను నిర్మూలించేందుకే ఆపరేషన్ సింధూర్ మొదలైంది.

కాశ్మీర్లో స్వర్గంలాంటి ప్రాంతం పహల్గామ్. ఏప్రిల్ 22, 2025లో భయంకరమ...