భారతదేశం, మే 7 -- పహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా, భారత భద్రతా దళాలు పాకిస్తాన్ మరియు పాక్ ఆక్రమిత కశ్మీర్ (POK)లోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై క్షిపణి దాడులు చేశాయి. ఈ దాడుల్లో 100కు పైగా ఉగ్రవాదులు మరణించినట్లు సమాచారం.

దేశవ్యాప్తంగా ఈ ప్రతీకార చర్యపై ఆనందోత్సాహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో మాజీ ఆర్మీ చీఫ్ మనోజ్ ముకుంద్ నరవాణే X (ట్విట్టర్)లో "పిక్చర్ అభీ బాకీ హై" అని పోస్ట్ చేశారు. అంటే ఇంకా సినిమా మిగిలే ఉందని పరోక్షంగా చెప్పారు. అంటే ఉగ్రవాద నిర్మూలన లక్ష్యంగా భారత్ మరిన్ని దాడులుచేయొచ్చని సంకేతాలు ఇచ్చారు.

భారత సాయుధ దళాలు పహల్గాం ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా మంగళవారం అర్ధరాత్రి పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్ (POK)లోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై క్షిపణి దాడులు చేశాయి. లష్కరే తొయిబా మరియు జైషే మహ్మద్ వంటి ఉగ్రవాద...