భారతదేశం, మే 9 -- పాకిస్థాన్, భారత్ మధ్య రోజురోజుకు ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. పాకిస్థాన్ దాడులను భారత్ గట్టిగా తిప్పికొట్టింది. పాకిస్థాన్‌తో పోరాటం నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. అవసరమైతే టెరిటోరియల్ ఆర్మీని కూడా రంగంలోకి దింపాలని అనుకుంటోంది. రెగ్యూలర్ ఆర్మీతో కలిసి పని చేసేందుకు సిద్ధంగా ఉండాలని కేంద్రం చెప్పింది. టెరిటోరియల్ ఆర్మీ గురించి పూర్తి వివరాలేంటో చూద్దాం..

టెరిటోరియల్ ఆర్మీ అనేది భారత సైన్యానికి రిజర్వ్ ఫోర్స్, ఇది భారత సైన్యానికి సేవలందించే పార్ట్-టైమ్ వాలంటీర్లతో కూడి ఉంటుంది. టెరిటోరియల్ ఆర్మీలో అధికారులు, జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్లు, నాన్-కమిషన్డ్ ఆఫీసర్లు, భారత సైన్యంలో ఉన్నవారికి సమానమైన ర్యాంకులను కలిగి ఉన్న ఇతర సిబ్బంది ఉంటారు. ఈ ఆర్మీ ప్రధానంగా సాధారణ సైన్యాన్ని స్థిర విధుల నుండి ఉపశమనం కలిగించడానికి, ప్...