భారతదేశం, మే 28 -- పాకిస్థాన్ లోని మురిద్, నూర్ ఖాన్ వైమానిక స్థావరాలపై మే 10న భారత్ జరిపిన సైనిక దాడుల వల్ల జరిగిన నష్టాన్ని కొత్త ఉపగ్రహ చిత్రాలు వెల్లడించాయి. కమాండ్ అండ్ కంట్రోల్ వాహనాలుగా భావించే రెండు పెద్ద ట్రక్కులను ధ్వంసం చేయడం, రావల్పిండిలోని నూర్ ఖాన్ ఎయిర్ బేస్ వద్ద దాదాపు 7,000 చదరపు అడుగుల నిర్మాణాన్ని కూల్చివేయడం వంటి దృశ్యాలను మాక్సర్ అందించిన హై రిజల్యూషన్ శాటిలైట్ చిత్రాలు చూపించాయి. ఈ వైమానిక స్థావరం పాకిస్తాన్ ఆర్మీ జనరల్ హెడ్ క్వార్టర్స్, అణ్వాయుధాలను పర్యవేక్షించే స్ట్రాటజిక్ ప్లాన్స్ డివిజన్ రెండింటికీ సమీపంలో ఉంది.

పాకిస్తాన్ లోని మురిద్, నూర్ ఖాన్ వైమానిక స్థావరాలతో సహా ఎనిమిది పాక్ వైమానిక స్థావరాలపై భారత సైన్యం మే 10న ఆపరేషన్ సిందూర్ పేరుతో దాడులు నిర్వహించింది. భారత దాడుల తర్వాత, మే 10 మధ్యాహ్నం నుంచి కాల్పుల ...