భారతదేశం, మే 19 -- ిదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ సోమవారం పాకిస్థాన్‌కు సంబంధించిన అంశాలపై పార్లమెంటరీ ప్యానెల్‌కు వివరించారు. పాకిస్థాన్‌లోని ఏ అణు కేంద్రాలపైనా భారతదేశం దాడి చేయలేదని స్పష్టం చేశారు. ప్యానెల్‌లోని కొంతమంది సభ్యులు పాకిస్థాన్ నుండి ఏదైనా అణు దాడి జరుగుతుందని సమాచారం లేదా బెదిరింపు ఉందా అనే ప్రశ్నను కూడా అడిగారు. దీనిపై విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ మాట్లాడుతూ పాకిస్తాన్ నుండి ఎలాంటి అణ్వాయుధ దాడి ముప్పు లేదా సమాచారం లేదన్నారు.

సైనిక చర్యను నిలిపివేయాలనే నిర్ణయం ద్వైపాక్షిక స్థాయిలోనే తీసుకున్నామని విక్రమ్ మిస్రీ ప్రభుత్వ వైఖరిని పునరుద్ఘాటించినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అదే సమయంలో ఈ వివాదాన్ని ఆపాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వాదనలను కూడా విక్రమ్ మిస్రీ తోసిపుచ్చారు.

పాకిస్థాన్ చైనా ఆయుధాలను...