భారతదేశం, మే 28 -- పాకిస్థాన్ సరిహద్దుల్లోని గుజరాత్, రాజస్థాన్, పంజాబ్, జమ్ముకశ్మీర్ రాష్ట్రాల్లో గురువారం నుంచి సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్స్ ప్రారంభం కానున్నాయి. అలాగే, రాష్ట్ర అత్యవసర సన్నద్ధత మరియు ప్రతిస్పందన సామర్థ్యాలను పెంచడానికి హర్యానా ప్రభుత్వం మే 29 న సాయంత్రం 5 గంటల నుండి మొత్తం 22 జిల్లాల్లో "ఆపరేషన్ షీల్డ్" పేరుతో ఒక ప్రధాన పౌర రక్షణ విన్యాసాన్ని నిర్వహించనుంది.

పొరుగు దేశంపై భారతదేశం ఆపరేషన్ సిందూర్ ప్రారంభించిన కొద్ది వారాల తరువాత పాకిస్తాన్ సరిహద్దు రాష్ట్రాల్లో సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్స్ ను నిర్వహిస్తున్నారు. పాకిస్తాన్ అభ్యర్థన మేరకు ఆపరేషన్ సిందూర్ ను తాత్కాలికంగా నిలిపివేసి, కాల్పుల విరమణకు భారత్ అంగీకరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మే 29న ప్రభుత్వం 4 సరిహద్దు రాష్ట్రాల్లో డిఫెన్స్ మాక్ డ్రిల్స్ ను ప్రకటించి...