భారతదేశం, మే 7 -- జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి తర్వాత దేశమంతా ఆగ్రహంతో ఉంది. ప్రతిస్పందనగా, భారత సైన్యం అర్ధరాత్రి 1:30 గంటలకు ఆపరేషన్ సింధూర్‌తో పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని 9 ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసింది.

ఈ ఆపరేషన్‌లో కనీసం 30 మంది ఉగ్రవాదులు హతమయ్యారని సమాచారం. పాకిస్తాన్‌లోని బహవల్‌పూర్, కోట్లీ, ముజఫరాబాద్, గుల్‌పూర్, భింబెర్, సియాల్‌కోట్, మురిద్కేలలోని ఉగ్రవాదుల శిబిరాలను సైన్యం పూర్తిగా నాశనం చేసింది.

దీనితో పాటు, మురిద్కేలోని లష్కర్-ఎ-తోయిబా శిక్షణ శిబిరం మార్కాజ్-ఎ-తోయిబా, బహవల్‌పూర్‌లోని జైష్-ఎ-మొహమ్మద్ స్థావరం జష్-శుభానల్లాను కూడా ప్రధానంగా లక్ష్యంగా చేసుకున్నారు. ఈ ఆపరేషన్ తర్వాత పలువురు విపక్ష నేతల స్పందనలు వస్తున్నాయి.

ఆపరేషన్ సింధూర్‌పై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సోషల్ మీడియాలో - 'మా సైన్య...