భారతదేశం, మే 11 -- ్రతిపక్ష నేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే ఆపరేషన్ సిందూర్, కాల్పుల విరమణపై చర్చించడానికి పార్లమెంటు ప్రత్యేక సమావేశాలను ఏర్పాటు చేయాలని ప్రధాని మోదీకి లేఖ రాశారు. సమాచారాన్ని ప్రజల ముందు ఉంచాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విజ్ఞప్తి చేశారు. పహల్గామ్, ఆపరేషన్ సిందూర్, కాల్పుల విరమణపై దేశ ప్రజలకు, ప్రజా ప్రతినిధులకు పూర్తి సమాచారం ఇవ్వాలన్నారు. పార్లమెంటులో చర్చించాలని ప్రధాని మోదీకి రాసిన లేఖలో పేర్కొన్నారు. పార్లమెంటు ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయాలని మొత్తం ప్రతిపక్షాల తరఫున విజ్ఞప్తి చేస్తున్నట్టుగా చెప్పారు.

'పార్లమెంటు ప్రత్యేక సమావేశాలను ఏర్పాటు చేయాలని మొత్తం ప్రతిపక్షాల తరఫున మిమ్మల్ని కోరుతున్నాను. పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్, కాల్పుల విరమణపై పార్లమెంటులో చర్చించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాల్పుల...