భారతదేశం, ఏప్రిల్ 26 -- కర్రె గుట్టల్లో మావోయిస్టుల కోసం వేట కొనసాగుతోంది. ఛత్తీస్గఢ్, తెలంగాణ సరిహద్దుల్లోని ఈ ప్రాంతంలో మావోయిస్టు అగ్రనేత హిడ్మాతో పాటు పలువురు ముఖ్యమైన నేతలు తలదాచుకున్నారన్న సమాచారంతో.. భద్రతా బలగాలు విస్తృతమైన గాలింపు చర్యలు చేపట్టాయి. గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న ఈ ఆపరేషన్లో ఇప్పటికే పలువురు మావోయిస్టులు హతమయ్యారు. తాజాగా.. జరిగిన ఎన్కౌంటర్లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందినట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయాన్ని పోలీసులు అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉంది.
భద్రతా బలగాలు డ్రోన్లు, హెలికాప్టర్లను ఉపయోగిస్తూ అణువణువు గాలిస్తున్నాయి. గ్రేహౌండ్స్, ఛత్తీస్గఢ్ డీఆర్జీ, సీఆర్పీఎఫ్ వంటి వివిధ దళాలు సంయుక్తంగా ఈ ఆపరేషన్లో పాల్గొంటున్నాయి. మావోయిస్టులు అమర్చిన మందుపాతర...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.