భారతదేశం, ఆగస్టు 6 -- మంగళవారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​లు స్వల్ప నష్టాల్లో ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 308 పాయింట్లు పడి 80,710 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 73 పాయింట్లు కోల్పోయి 24,650 వద్ద సెషన్​ని ముగించింది. బ్యాంక్​ నిఫ్టీ 259 పాయింట్లు పడి 55,360 వద్దకు చేరింది.

మంగళవారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 2,383.44 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 2,788.87 కోట్లు విలువ చేసే షేర్లను కొన్నారు.

ఇక దేశీయ స్టాక్​ మార్కెట్​లు.. బుధవారం ట్రేడింగ్​ సెషన్​ని ఫ్లాట్​గా ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్​ నిఫ్టీ దాదాపు 25 పాయింట్ల నష్టంలో ఉండటం ఇందుకు కారణం.

"నిఫ్టీ50కి 24,530 లెవల్​ కీలక సపోర్ట్​గా ఉండనుంది. 24,780- 24,950 లెవల్స్​ రెసిస్టెన్స్​గా ఉన్నాయి," అని హెచ్​డీఎఫ్​సీ సెక్యూరిటీస్​ డిప్యూ...