Hyderabad, మే 6 -- వంట అనేది కేవలం రుచి కోసం లేదా ఆకలి తీర్చుకోవడం కోసం మాత్రమే కాదు. ఆహారం వండటం, తినడం అనేది మీ శారీరక, మానసిక ఆరోగ్యంతో ముడిపడి ఉంటుంది. కాబట్టి వంట చేసే విధానంలోని సూక్ష్మ నైపుణ్యాలను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ప్రతి ఆహార పదార్థాన్ని తయారు చేయడానికి ఒక ప్రత్యేకమైన పద్ధతి ఉంటుంది, ఆ పద్ధతిని పాటించడం ద్వారా మాత్రమే ఆహారం రుచికరంగా ఉండటంతో పాటు ఆరోగ్యకరంగా మారుతుంది. లేదంటే అనారోగ్యానికి దారితీస్తుంది.

ఉదాహరణకు కొన్ని ఆహార పదార్థాలను వంటకు లేదా తినడానికి ముందు కొంత సేపు నీటిలో నానబెట్టడం వల్ల వాటి ప్రయోజనాలు రెట్టింపు అవుతాయి. ఆయుర్వేదం కూడా నానబెట్టిన ఆహారం సులభంగా జీర్ణమవడమే కాకుండా, దానిలోని పోషకాలు శరీరానికి బాగా అందుతాయని చెబుతోంది. మరి వంటకు ముందు తప్పకుండా నానబెట్టాల్సిన ఆ ప్రత్యేకమైన ఆహార పదార్థాలేంటో చూసేద్దా...