భారతదేశం, మే 3 -- భార‌తదేశంలో పేద‌ల‌కు ఇంత పెద్ద ఎత్తున రూ.5 లక్ష‌ల‌తో సంవ‌త్సరానికి నాలుగున్న‌ర ల‌క్ష‌ల ఇండ్లు నిర్మిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ.. అని మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి వివరించారు. పేదలు ఆత్మ‌గౌర‌వంతో బ‌తకాల‌న్న సంక‌ల్పంతో.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వ‌ర్యంలో తెలంగాణ ప్ర‌భుత్వం ఇందిర‌మ్మ ఇండ్ల ప‌థకానికి శ్రీ‌కారం చుట్టింద‌న్నారు. ఈ ఏడాది 22 వేల కోట్ల రూపాయల‌తో 4.50 ల‌క్ష‌ల ఇందిర‌మ్మ ఇండ్లు నిర్మించ‌బోతున్నామ‌ని ప్రకటించారు. ఇందుకు సంబంధించి మ‌రికొద్ది రోజుల్లో ల‌బ్దిదారుల ఎంపిక ప్ర‌క్రియ పూర్తిచేస్తామ‌ని చెప్పారు. ఇప్ప‌టికే పైల‌ట్ గ్రామాల్లో ఇండ్ల నిర్మాణాలు చురుగ్గా సాగుతున్నాయ‌ని వివరించారు.

హౌసింగ్ కార్పొరేష‌న్‌లో ఔట్ సోర్సింగ్‌ పద్ధతిలో నియామ‌క‌మైన 350 మంది అసిస్టెంట్ ఇంజ‌నీర్లకు.. నేష‌న‌ల్ అకాడ‌మీ ఆఫ్ క‌న్‌స్ట...