Hyderabad,telangana, మే 9 -- అర్హులైన జర్నలిస్టులందరికీ ఇందిరమ్మ ఇండ్లు అందజేస్తామని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు.గ్రామీణ ప్రాంతాల్లో పని చేసే నిరుపేదలైన జర్నలిస్టులతో పాటు. వృత్తి నిర్వహణలో చనిపోయిన జర్నలిస్టుల కుటుంబాలకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తుందన్నారు.

విధి నిర్వహణలో చనిపోయిన జర్నలిస్టుల కుటుంబాలతో పాటు పలువురు జర్నలిస్టులకు నాంపల్లి లోని ప్రెస్ అకాడమీ కార్యాలయంలో పెన్షన్ మరియు ఎక్స్ గ్రేషియా చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ. ఈ నెల చివరిలోగా ప్రెస్ అకాడెమీ భవనం ప్రారంభిస్తామని చెప్పారు.

మండల, నియోజకవర్గ స్థాయిలో పని చేస్తున్న జర్నలిస్టులను ఆదుకోవడానికి ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నామని వివరించారు. మంచిని మంచిగా, నిజాన్ని నిర్భయంగా సమాజానికి తెలియజేయడాన...