భారతదేశం, జూన్ 10 -- లయాల్లో సుదీర్ఘంగా సేవలు అందిస్తున్న అర్చక, ఉద్యోగుల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా నిధిని ఏర్పాటు చేసింది. తాజాగా మంత్రి కొండా సురేఖ అర్చక సంక్షేమ నిధి పోస్టర్‌ను విడుదల చేశారు. అర్చకులు, ఉద్యోగుల గ్రాట్యుటీని రూ.4 లక్షల నుంచి రూ.8లక్షలకు పెంచుతున్నట్టుగా చెప్పారు.

అర్చక సంక్షేమ ట్రస్ట్ ద్వారా 13700 మందికి లబ్ధి చేకూరనుంది. మరణం తర్వాత లేదా రిటైర్మెంట్ తర్వాత గ్రాట్యుటీ చెల్లింపు ఉంటుంది. మెడికల్ రీయింబర్స్‌మెంట్, వివాహ, గృహ నిర్మాణ, విద్యా పథకాలు కూడా అందిస్తారు. ఇది అర్చకులు, ఉద్యోగుల ఆర్థిక భద్రతకు సాయపడుతుంది.

ధూపదీప నైవేద్య అర్చకులకు మరణానంతరం చెల్లించే గ్రాట్యూటీని నిర్ధారించారు. మరణం తర్వాత చెల్లించే ఎ్స్ గ్రేషియా, అంతిమ సంస్కారాల ఖర్చుల నిమిత్తం నిధి ఉపయోగపడుతుంది. ఈ నిధి కింద ఉద్యోగులకు మెడికల...