భారతదేశం, మే 22 -- క‌న్న‌డ మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్ వెబ్‌సిరీస్ అయ్య‌నామానే ఇటీవ‌లే జీ5 ఓటీటీ ద్వారా తెలుగు ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. ఖుషిర‌వి ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ఈ వెబ్‌సిరీస్‌కు ర‌మేష్ ఇందిర ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఆరు ఎపిసోడ్స్‌తో తెర‌కెక్కిన ఈ థ్రిల్ల‌ర్ వెబ్‌సిరీస్ ఎలా ఉందంటే?

జాజి(ఖుషి ర‌వి)కి దుష్యంత్‌తో (అక్ష‌య్ నాయ‌క్‌) పెళ్లి జ‌రుగుతుంది. సంతోషంగా అత్తింట్లో భ‌ర్త‌తో క‌లిసి కుడికాలు పెట్ట‌బోతుండ‌గా దుష్యంత్ తండ్రి చ‌నిపోతాడు. కొత్త కోడ‌లి వ‌ల్లే ఈ మ‌ర‌ణం సంభ‌వించింద‌ని పూజారి నింద‌లు వేస్తాడు. కానీ దుష్యంత్ మాత్రం జాజి త‌ప్పేం లేద‌ని భార్య‌ను వెన‌కేసుకొస్తాడు. దుష్యంత్‌కు శివ‌, మ‌హేష్ అనే ఇద్ద‌రు అన్న‌య్య‌లు ఉంటారు.

శివ భార్య చారుమ‌తి, మ‌హేష్ వైఫ్ పుష్ప‌వ‌తి ఆత్మ‌హ‌త్య చేసుకున్నార‌నే నిజం జాజికి తెలుస్తుంది. దుష్యం...