భారతదేశం, జూన్ 1 -- అమెరికా ఇమ్మిగ్రేషన్ చట్టాలు కఠినతరం కావడం, డొనాల్డ్ ట్రంప్ పాలనలో వలసదారులు మీద మరింత ఫోకస్ చేస్తుండటంతో భారతీయులు ఇప్పుడు వేరే మార్గాన్ని ఎంచుకుంటున్నారు. భారతీయ విద్యార్థులు ఈబీ-5 వీసాపై ఆసక్తి చూపిస్తున్నారు. గత నాలుగైదు నెలల్లో భారతీయ విద్యార్థుల నుంచి ఈబీ-5 పిటిషన్లు 100 శాతానికి పైగా పెరిగాయని ఎకనామిక్ టైమ్స్ నివేదించింది.

8 లక్షల డాలర్ల పెట్టుబడితో విదేశీ ఇన్వెస్టర్లు ఈబీ-5 విధానం ద్వారా గ్రీన్ కార్డు లేదా శాశ్వత నివాసాన్ని పొందవచ్చు. అయితే భారత్ కు కేవలం 700 సెట్లను మాత్రమే పరిమితం చేసింది. ఇతర సంవత్సరాలతో పోలిస్తే పరిమిత సంఖ్యలో సీట్లు ఉన్నప్పటికీ ఈబీ-5 పిటిషన్లు గణనీయంగా పెరిగాయి.

ఈబీ-5 ప్రాంతీయ కేంద్రాలను నిర్వహించే యూఎస్ ఇమ్మిగ్రేషన్ ఫండ్ (యుఎస్ఐఎఫ్) 2024తో పోలిస్తే ఈ సంవత్సరం జనవరి నుండి ఈబీ -5 వీసాల కో...