భారతదేశం, జనవరి 5 -- అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ నివాసంలో కలకలం రేగింది. ఓహియోలోని ఆయన ఇంటిపై జరిగిన దాడిలో కిటికీలు ధ్వంసమయ్యాయి. ఈ ఘటనకు సంబంధించి ఒక వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
సీఎన్ఎన్ (CNN) కథనం ప్రకారం, సిన్సినాటిలోని వాన్స్ నివాసంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే, అదృష్టవశాత్తు ఆ సమయంలో ఉపాధ్యక్షుడు గానీ, ఆయన కుటుంబ సభ్యులు గానీ ఇంట్లో లేరు. నిందితుడు ఇంటి లోపలికి ప్రవేశించలేదని, కేవలం బయటి నుండే కిటికీలను పగులగొట్టాడని ఫెడరల్ లా ఎన్ఫోర్స్మెంట్ వర్గాలు ప్రాథమికంగా నిర్ధారించాయి.
స్థానిక వార్తా సంస్థల సమాచారం ప్రకారం.. ఈ దాడిలో ఇంటి వెలుపలి కిటికీల అద్దాలు భారీగా ధ్వంసమయ్యాయి. ఘటనా స్థలం వద్ద అద్దపు ముక్కలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. విషయం తెలిసిన వెంటనే అమెరికా అధ్యక్ష, ఉపాధ్యక్షుల భద్రతను పర...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.