భారతదేశం, డిసెంబర్ 29 -- అమెరికాలోని కాలిఫోర్నియాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో తెలంగాణకు చెందిన ఇద్దరు యువతులు మరణంచారు. మహబూబాబాద్ జిల్లా గార్ల మండలానికి చెందిన మీసేవ కేంద్రం నిర్వాహకుడు నాగేశ్వరరావు కూతురు మేఘన, కడియాల కోటేశ్వరరావు కూతురు భావన మృతిచెందారు.

అమెరికాలో తెలుగు విద్యార్థుల మరణాలు కలకలం రేపుతున్నాయి. ఇటీవలే రోడ్డు ప్రమాదంలో తెలుగువారు మరణించిన వార్తలు వచ్చాయి. తాజాగా తెలంగాణ రాష్ట్రానికి చెందిన మరో ఇద్దరు యువతలు దుర్మరణం పాలయ్యారు. ఉన్నత చదువుల కోసం వెళ్లి రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో వారి కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి.

Published by HT Digital Content Services with permission from HT Telugu....