భారతదేశం, ఏప్రిల్ 9 -- అమెరికా, చైనా మధ్య టారిఫ్ వార్ గట్టిగా నడుస్తోంది. చైనా వస్తువులపై అదనపు సుంకాలను విధించాలని అమెరికా నిర్ణయించింది. ఈ మేరకు యూఎస్ భారీ స్థాయిలో సుంకాలు విధించింది. చైనా వస్తువులపై టారిఫ్ 104 శాతం చేసింది. అంతేకాదు ఏప్రిల్ 9 నుంచే ఈ టారిఫ్స్ అమల్లోకి వస్తాయని అమెరికా ప్రకటించింది. అమెరికా, చైనా మధ్య జరుగుతున్న వాణిజ్య యుద్ధంలో ఇప్పటివరకు తీసుకున్న అత్యంత దూకుడు చర్యలలో ఇది ఒకటి. ఫాక్స్ బిజినెస్ ప్రకారం, వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లెవిట్ మాట్లాడుతూ.. అమెరికాపై చైనా తన ప్రతీకార సుంకాలను ఎత్తివేయలేదని అన్నారు. అటువంటి పరిస్థితిలో అమెరికా ఏప్రిల్ 9 నుండి చైనా దిగుమతులపై మొత్తం 104 శాతం సుంకాన్ని విధించడం ప్రారంభిస్తుందని చెప్పారు.

నిజానికి మెుదట ట్రంప్ 34 శాతం విధించిన టారిఫ్‌లకు ప్రతీకారంగా చైనా కూడా 34 శాతం విధ...