భారతదేశం, మే 2 -- రాష్ట్రంలో 2019-24 నడుమ విధ్వంస పాలన నడిచిందని మంత్రి లోకేష్ ఆరోపించారు. చంద్రబాబుపై వ్యక్తిగత కక్షతో అమరావతిని చంపాలని చూశారని విమర్శించారు. ఒక్క ఇటుక పెట్టకుండా మూడు రాజధానులు అంటూ ఐదేళ్లు కాలం గడిపేశారని ధ్వజమెత్తారు. అమరావతి పనుల పునః ప్రారంభం సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో లోకేష్ మాట్లాడారు.

'8 ఏళ్ల పిల్లాడి దగ్గర నుండి 80 ఏళ్ళ వృద్ధుల వరకూ జై అమరావతి అంటూ జెండా పట్టారు. జై అమరావతి అన్నందుకు అనాడు రైతులకు సంకెళ్లు వేశారు. అమరావతి ఉద్యమంలో పాల్గొన్నందుకు మహిళా రైతుల్ని పోలీసుల బూటు కాలితో తన్నించారు. 1631 రోజుల పాటు అమరావతి ఉద్యమం కొనసాగింది. 270 మంది రైతులు చనిపోయారు. 3 వేల మంది పై అక్రమ కేసులు పెట్టారు. ఎన్ని కుట్రలు చేసినా జై అమరావతి నినాదాన్ని మాత్రం ఆపలేకపోయారు. ఆపడానికి, పీకడానికి అమరావతి ఎవరి ఇంట్లో పెంచుకున్న ...