భారతదేశం, మే 3 -- అమరావతిలో సభ జరిగిన వేదిక మీద నుంచి చంద్రబాబు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్‌లు అనేక అబద్దాలను మాట్లాడారని.. మాజీమంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. ఆ సభ చూసిన తరువాత అమరావతి అనేది ఒక అంతులేని కథ, దానికి సశేషం ఉండదు అని భావన రాష్ట్ర ప్రజలకు కలిగిందన్నారు. మొదటి నుంచి రాజధానిని అడ్డం పెట్టుకుని ఎలా జేబులు నింపుకోవాలన్నదే చంద్రబాబు ఆలోచన అని సంచలన వ్యాఖ్యలు చేశారు.

'నిజంగా రాజధానిని నిర్మించే చిత్తశుద్ది చంద్రబాబుకు లేదు. రాష్ట్ర విభజన తరువాత అనుభవం ఉందని చంద్రబాబుకు ప్రజలు అనుకూలంగా తీర్పు ఇచ్చారు. రాజధాని లేని రాష్ట్రానికి గొప్ప రాజధానిని, కొత్త నగరాన్నే తీసుకువస్తానంటూ.. చంద్రబాబు ఊదరగొట్టారు. 2014 నుంచి 19 మధ్య ముఖ్యమంత్రిగా అమరావతి రాజధాని నిర్మాణానికి రూ.48 వేల కోట్ల పనులు చేపడుతున్నట్లు ప్రకటించారు. రూ.41 వేల కోట్లకు టెండ...