Andhrapradesh, జూన్ 25 -- అమరావతిలో 2026 జనవరి నాటికి మొదటి క్వాంటం కంప్యూటింగ్ వ్యాలీ ప్రారంభం అవుతుందని రాష్ట్ర ఐటీ శాఖ కార్యదర్శి కాటమనేని భాస్కర్ తెలిపారు. ఏపీతో పాటు వేర్వేరు ప్రాంతాల్లో ఉన్న విద్య, వైద్యారోగ్యం, ఫార్మా, ఆగ్రిటెక్, మెడ్ టెక్ సంస్థలు. ఈ క్వాంటం కంప్యూటింగ్ వ్యాలీ సేవలు వినియోగించుకోవచ్చన్నారు. ఆయా సంస్థలు పరిశోధలతో పాటు వివిధ పరిష్కారాలను క్వాంటం టెక్నాలజీ ద్వారా వెతుక్కునే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు.

సమీప భవిష్యత్తులో లక్షల మంది అమరావతి క్వాంటం వ్యాలీ టెక్ పార్క్ నుంచి పనిచేసేందుకు ఆస్కారం ఉందని చెప్పారు. అమరావతిలో ఏర్పాటు చేసే క్వాంటం వ్యాలీ సెంటర్ ఏపీ రాష్ట్రానికి మాత్రమే పరిమితం కాదన్నారు. దేశంలోని వేర్వేరు ప్రాంతాలు, రాష్ట్రాలు, ప్రభుత్వాలు, సంస్థలు వినియోగించుకోవచ్చని వెల్లడించారు.

"మానవ సమాజానికి విస్తృతంగా...