భారతదేశం, మే 2 -- అమరావతిని మూడేళ్లలో పూర్తి చేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటన చేశారు. అమరావతి పునఃప్రారంభోత్సవ సభలో మాట్లాడిన ఆయన. అమరావతి పూర్తి అయిన తర్వాత ప్రధాని మోదీని మళ్లీ ఆహ్వానిస్తామని చెప్పారు. రూ.57,980 కోట్ల ప్రాజెక్టులకు ఇవాళ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జరుగుతున్నాయని వెల్లడించారు.

"మోదీ గైడెన్స్‌తో అమరావతిని ప్రపంచం మెచ్చే రాజధానిగా తయారు చేస్తాం.. అమరావతి 5 కోట్ల మంది ప్రజల సెంటిమెంట్. 5 లక్షల మంది అమరావతిలో చదువుకునే అవకాశం ఉంటుంది. అమరావతిని హెల్త్, ఎడ్యుకేషనల్ హబ్‌గా చేస్తాం.. అమరావతిని పర్యావరణహితంగా తయారు చేస్తాం. బిట్స్ పిలానీ, టాటా ఇన్నోవేషన్ హాబ్ లాంటి సంస్థలు ఇక్కడికి వస్తాయి" అని సీఎం చంద్రబాబు ఆకాంక్షించారు.

అమరావతి రైతులు గత ఐదేళ్లు పోరాడారని సీఎం చంద్రబాబు గుర్తు చేశారు. గత ప్రభుత్వం అమరావతి భవిష్యత్‌ను తుడి...