Telangana,hyderabad, జూన్ 21 -- రాష్ట్రంలో మరోసారి ఉపఎన్నిక రాబోతుంది. ఇప్పటికే రాజకీయాలు రసవత్తరంగా సాగుతుండగా.. ఈ బైపోల్ తో మరో లెవల్ కి వెళ్లే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. కాంగ్రెస్ సర్కార్ పై తీవ్రస్థాయిలో వ్యతిరేకత ఉందని బీఆర్ఎస్ చెబుతుంటే. అలాంటి పరిస్థితే లేదంటోంది కాంగ్రెస్. ఇదే టైమ్ లో కాంగ్రెస్, బీఆర్ఎస్ లను టార్గెట్ చేస్తూ బీజేపీ నేతలు వాయిస్ పెంచుతున్నారు. ఇలాంటి పరిస్థితుల మధ్య గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎవరు పైచేయి సాధిస్తారనేది ఆసక్తికరంగా మారింది.

2023 అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో బీఆర్ఎస్ సత్తా చాటిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి మాగంటి గోపినాథ్ విజయం సాధించారు. అయితే అనారోగ్యంతో ఆయన ఇటీవలే మృతి చెందారు. దీంతో ఈస్థానానికి ఉపఎన్నిక రావటం ఖాయమైప...