భారతదేశం, జూన్ 24 -- బాలీవుడ్ థ్రిల్లర్ చిత్రం 'రైడ్ 2' ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అయింది. స్ట్రీమింగ్ డేట్ గురించి అధికారిక ప్రకటన వచ్చేసింది. అజయ్ దేవ్‍గణ్ హీరోగా నటించిన ఈ సినిమా మే 1వ తేదీని థియేటర్లలో రిలీజైంది. రాజ్‍కుమార్ గుప్తా దర్శకత్వం వహించిన ఈ సీక్వెల్ మూవీ మంచి హిట్ సాధించింది.

రైడ్ 2 మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ కోసం చాలా మంది ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. థియేట్రికల్ రన్‍లో పాజిటివ్ టాక్‍ను ఈ సినిమా దక్కించుకుంది. ఓటీటీ రిలీజ్‍పై కూడా ఇంట్రెస్ట్ నెలకొంది. ఈ క్రమంలో ఇప్పుడు రైడ్ 2 సినిమా ఓటీటీ స్ట్రీమింగ్‍పై అధికారిక ప్రకటన వచ్చేసింది.

రైడ్ 2 చిత్రం నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో జూన్ 26వ తేదీన స్ట్రీమింగ్‍కు రానుంది. అంటే మరో రెండు రోజుల్లో ఈ మూవీ స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టనుంది. ఈ విషయాన్ని ఆ ప్లాట్‍ఫామ్ నేడు (జూన్ 24) అధిక...