భారతదేశం, జూన్ 9 -- ొరుగు దేశమైన పాకిస్థాన్ అప్పుల ఊబిలో కూరుకుపోతోంది. సోమవారం విడుదల చేసిన పాకిస్థాన్ ఆర్థిక సర్వే నివేదికలో ఆ దేశ అప్పులు ఆల్ టైమ్ గరిష్ట స్థాయికి చేరుకున్నాయని వెల్లడైంది. ఇది ఇప్పటికే అధ్వాన్నంగా ఉన్న పాకిస్థాన్ ఆర్థిక పరిస్థితిని మరింత దిగజార్చింది. ఆర్థిక సర్వే నివేదిక ప్రకారం, పాకిస్థాన్ మొత్తం ప్రజా రుణం (మార్చి 2025 నాటికి) 76,007 బిలియన్ పాకిస్థాన్ రూపాయలకు చేరుకుంది. ఇది దేశ చరిత్రలో ఎన్నడూ నమోదు చేయని అత్యధిక రుణం.

అంటే ఈ అప్పు భారత కరెన్సీలో రూ.23 లక్షల కోట్లు. 2020-21లో రూ.39,860 బిలియన్లుగా ఉన్న పాకిస్థాన్ ప్రభుత్వ రుణం గత నాలుగేళ్లలో దాదాపు రెట్టింపు అయిందని నివేదికలు చెబుతున్నాయి. పదేళ్ల క్రితం పాకిస్థాన్ ప్రభుత్వ రుణం రూ.17,380 బిలియన్లు. ఈ విధంగా గత దశాబ్దంలో ప్రభుత్వ రుణం దాదాపు ఐదు రెట్లు పెరిగింది. ...