భారతదేశం, మే 22 -- ఒక్క ఏడాదిలో ఎంత మార్పు. 2024 ఐపీఎల్ లో అవమానాలు ఎదుర్కొని, జీరోగా మిగిలాడు హార్దిక్ పాండ్య. కానీ ఈ ఐపీఎల్ 2025లో వరుస ఓటముల తర్వాత టీమ్ పుంజుకుని ప్లేఆఫ్స్ చేరడంలో కీ రోల్ ప్లే చేశాడు. తన కెప్టెన్సీలో ముంబయి ఫస్ట్ టైమ్ ప్లేఆఫ్స్ చేరింది. దీంతో అప్పటి జీరో ఇప్పుడు హీరోగా మారాడు. ఫ్యాన్స్ అందరూ అతనిపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

2023 సీజన్ వరకూ ముంబయి ఇండియన్స్ పరిస్థితి బాగానే ఉంది. రోహిత్ శర్మ కెప్టెన్. అప్పటికే అయిదు టైటిళ్లు గెలిచింది టీమ్. కానీ 2024 సీజన్ కోసం గుజరాత్ టైటాన్స్ నుంచి హార్దిక్ పాండ్యను రప్పించి మరీ రోహిత్ స్థానంలో కెప్టెన్ గా చేశారు. దీంతో ఫ్యాన్స్ రగిలిపోయారు. ఎంఐ జెర్సీలను తగలబెట్టారు. స్టేడియంలో హార్దిక్ కనిపిస్తే చాలు హేళన చేశారు. ఎగతాళిగా కామెంట్లు చేశారు.

హార్దిక్ పాండ్య కెప్టెన్ గా రావడంతో ముం...