భారతదేశం, ఫిబ్రవరి 11 -- స్టాక్ మార్కెట్లో హెల్త్‌కేర్ దిగ్గజం అపోలో హాస్పిటల్స్ కాసుల వర్షం కురిపిస్తోంది. మంగళవారం సాయంత్రం ప్రకటించిన క్యూ3 ఫలితాల్లో కంపెనీ అదరహో అనిపించింది. కేవలం లాభాల్లోనే కాదు, నిర్వహణ పరంగా కూడా అద్భుతమైన వృద్ధిని కనబరచడంతో బుధవారం మార్కెట్ ప్రారంభం నుంచే షేరు ధరలో బుల్ రన్ కనిపిస్తోంది.

కంపెనీ ప్రధాన ఆదాయ వనరైన హెల్త్‌కేర్ సర్వీసెస్ (ఆసుపత్రులు) ఆదాయం 14% పెరిగి Rs.3,183 కోట్లకు చేరింది. రోగుల చేరిక పెరగడం, సంక్లిష్టమైన శస్త్రచికిత్సలు (రోబోటిక్ సర్జరీలు వంటివి) నిర్వహించడం వల్ల మార్జిన్లు 24.8 శాతానికి మెరుగుపడ్డాయని అపోలో చైర్మన్ డాక్టర్ ప్రతాప్ సి. రెడ్డి వివరించారు. ముఖ్యంగా చెన్నై వంటి నగరాల్లో స్ట్రోక్ కేర్ నెట్‌వర్క్‌ను విస్తరించడం కంపెనీకి కలిసి వచ్చిందని ఆయన పేర్కొన్నారు.

వ్యాపార విస్తరణ, పెరుగుతున్న ...