భారతదేశం, జూలై 2 -- మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. మైనింగ్ కేసులో వంశీ బెయిల్‌ రద్దు చేసేందుకు నిరాకరించింది. మైనింగ్ వాల్యూయేషన్‌పై నివేదిక ఇచ్చిన తర్వాత చూస్తామని సుప్రీంకోర్టు తెలిపింది. తదుపరి విచారణ ఈనెల 16కు వాయిదా వేసింది. దీంతో వంశీ బెయిల్ విషయంలో అప్పీల్ కు వెళ్లిన ఏపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలినట్లు అయింది.

వల్లభనేని వంశీకి ఏలూరు జిల్లా నూజివీడులోని 15వ అదనపు జిల్లా జడ్జి కోర్టు మంగళవారం బెయిల్‌ మంజూరు చేసింది. నకిలీ ఇళ్ల స్థల పట్టాలు ఇచ్చారంటూ అ పెట్టిన అక్రమ కేసులో వంశీ ప్రస్తుతం రిమాండ్‌లో ఉన్నారు. ఈ కేసులో బెయిల్‌ కోసం వంశీ పిటిషన్‌ దాఖలు చేయగా.. 4 రోజుల క్రితం వాదనలు ముగిశాయి. ఇరువైపు వాదనలు విన్న కోర్టు.. మంగళవారం బెయిల్‌ మంజూరు చేసింది. దీంతో ఆయనపై నమోదైన అన్ని కేసుల్లో బెయిల్ లభించినట...