భారతదేశం, మే 3 -- జీవితంలో ఎవరూ లేకున్నా.. కావాల్సింది చదువు అని బలంగా నమ్మారు పోపూరి పూర్ణచంద్రరావు. అందుకే నైస్ విద్యాసంస్థను స్థాపించారు. అనాథలు, వీధి బాలలను విద్యావంతులుగా తీర్చిదిద్దాలని సంకల్పించి.. 2003 ఆగస్టు 15న నైస్‌ను ప్రారంభించారు. ఈ 23 ఏళ్లలో వందల మంది పిల్లలకు విద్యాబుధులు నేర్పించి ప్రయోజకులను చేశారు. ఇప్పుడు ఇక్కడ 150 మంది బాలబాలికలు ఉన్నారు. వారికి వేర్వేరుగా వసతి గృహాలున్నాయి. వాటిల్లో ఉత్యుత్తమ సౌకర్యాలు ఉన్నాయి.

ఇక్కడ సీబీఎస్‌ఈ సిలబస్‌ను బోధిస్తున్నారు. కంప్యూటర్, సైన్స్, గణితం ల్యాబ్‌లతోపాటు ఇక్కడున్న గ్రంథాలయంలో నాలుగు వేల పుస్తకాలున్నాయి. యూనిఫామ్, భోజనం, పుస్తకాలు, వసతి సదుపాయాలన్నీ ఉచితంగా అందిస్తారు. విద్యాబోధనే కాకుండా సువిశాల మైదానంలో బాస్కెట్‌బాల్, వాలీబాల్, టెన్నిస్, కబడ్డీ తదితర ఆటల్లో శిక్షణనిస్తున్నారు. ఇ...